వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠశాలకు ఉపాధ్యాయుడి చేయూత: సౌండ్ బాక్సుల బహుకరణ
Kumar Jun 22, 2026 10:28 AM బాపట్ల 3 viewsabout 3 hours ago

కర్లపాలెం జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు నక్క సంతోష్ కుమార్, సోమవారం పాఠశాలకు రూ. 8 వేల విలువైన సౌండ్ బాక్సులను అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆయన చేసిన ఈ సాయం పట్ల తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు తిరుపతి విజయ శ్రీ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడి చొరవ అభినందనీయమని కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...