వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సోమవారం తన పర్యటనలో భాగంగా ఒక ప్రైవేట్ పాఠశాల బస్సును ఆపి, విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల చదువు, యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు.
దేశానికి మంచి పేరు తెచ్చేలా ఎదగాలని విద్యార్థులను ఉత్సాహపరిచారు. అలాగే, బస్సు డ్రైవర్కు వాహనాన్ని జాగ్రత్తగా మరియు నిదానంగా నడపాలని సూచించి భద్రతపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

