వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులను వేధిస్తే చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక
Jaya Jun 22, 2026 10:50 AM అమరావతి 3 viewsabout 3 hours ago

ఎరువుల బలవంతపు విక్రయాలు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడితే కంపెనీలపై కూడా చర్యలు తప్పవు.
రాష్ట్రంలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని తెలిపారు. పారదర్శక పంపిణీ కోసం ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, రైతు ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...