వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు యువకుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనపై గుంటూరులో ఫిర్యాదు నమోదైంది. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
ఆ పత్రాలతో ఏడాదిపాటు పాఠాలు చెప్పినప్పటికీ జీతాలు రాకపోవడంతో మోసం జరిగినట్లు గుర్తించారు. నిందితులు పరారీలో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

