Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సజ్జపాడులో టీడీపీ దౌర్జన్యం

నిహారిక రెడ్డి Jul 21, 2026 8:32 AM ఎన్టీఆర్ జిల్లాabout 8 hours ago
సజ్జపాడులో టీడీపీ దౌర్జన్యం - Udayam Digital
ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం సజ్జపాడులో టీడీపీ నాయకులు బరితెగించి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన వినోద్‌, రాజేష్‌ ఇళ్లపై మూకుమ్మడిగా దాడి చేసి, మహిళలపైనా విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. తమకు రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీసులు స్థానిక టీడీపీ నేతలతో మంతనాలు జరపడం గమనార్హం.

Comments

G
Loading comments...