Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన మహిళపై టీడీపీ వేధింపులు

ధనుష్ రెడ్డి Jul 10, 2026 1:30 AM నెల్లూరు 4 viewsabout 5 hours ago
గిరిజన మహిళపై టీడీపీ వేధింపులు - Udayam Digital
నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీలో కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గిరిజన మహిళ పుట్టా భాగ్యమ్మను టీడీపీ ప్రభుత్వం రాగానే ఉద్యోగం నుండి తొలగించారు. ఉద్యోగం కోసం ఆమె తిరుగుతుండగా, భర్తకు విడాకులు ఇవ్వాలంటూ స్థానిక నేతలు పైశాచికంగా వేధిస్తున్నారు. ఈ కక్షసాధింపు చర్యల వల్ల తీవ్ర మానసిక వేదనతో ఆమె తండ్రి మృతి చెందారు. ప్రస్తుతం ఆమె హృద్రోగ బాధితుడైన భర్తతో కలిసి కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది.

Comments

G
Loading comments...