వార్తలకు తిరిగి వెళ్లండి
కుప్పం గడ్డపై అవకాడో సాగు

కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల రైతులు ప్రయోగాత్మకంగా అరుదైన అవకాడో పంటను సాగు చేస్తున్నారు. శెట్టేపల్లెకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి మూడెకరాల్లో 400 మొక్కలు నాటగా, ప్రస్తుతం దిగుబడి చేతికందే దశకు చేరింది.
సేంద్రియ ఎరువులు, బిందుసేద్యంతో సాగు చేస్తున్న ఈ పంట 25 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. మార్కెట్లో మంచి ధర ఉన్నందున గిట్టుబాటు ఆదాయం లభిస్తుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...