Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం గడ్డపై అవకాడో సాగు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 10, 2026 8:38 AM చిత్తూరుGeneral
కుప్పం గడ్డపై అవకాడో సాగు - Udayam
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల రైతులు ప్రయోగాత్మకంగా అరుదైన అవకాడో పంటను సాగు చేస్తున్నారు. శెట్టేపల్లెకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి మూడెకరాల్లో 400 మొక్కలు నాటగా, ప్రస్తుతం దిగుబడి చేతికందే దశకు చేరింది. సేంద్రియ ఎరువులు, బిందుసేద్యంతో సాగు చేస్తున్న ఈ పంట 25 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. మార్కెట్‌లో మంచి ధర ఉన్నందున గిట్టుబాటు ఆదాయం లభిస్తుందని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...