వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పోర్షే అనుబంధ ఐటీ సంస్థ ఎంహెచ్పీలో 100% వాటాను కొనుగోలు చేయనుంది. ఈ సంస్థ విలువ 320 మిలియన్ యూరోలు (రూ.3,574 కోట్లు)గా టీసీఎస్ తెలిపింది. ఈ కొనుగోలు పోర్షేతో కుదిరిన ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగం. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 3-4 నెలల్లో లావాదేవీ పూర్తికానుంది.
Comments
Loading comments...

