వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో ఇంటి పన్నుల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లలో పన్నుల వసూలు లక్ష్యాన్ని 40 శాతానికి పైగా పెంచిన ప్రభుత్వం, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి.
పంచాయతీలు నిధుల కొరత ఎదుర్కొంటుండగా పారిశుధ్య నిర్వహణ క్షీణిస్తోందని గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూలు లక్ష్యం రూ.1,233.99 కోట్లుగా నిర్ణయించారు.
Comments
Loading comments...
