వార్తలకు తిరిగి వెళ్లండి
తమ్మినేని సీతారాం కుటుంబంపై భూకబ్జా కేసు

శ్రీకాకుళంలో విలువైన భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించిన వ్యవహారంలో వైకాపా నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణితో సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కుంభకోణంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మహేశ్వర్రెడ్డి తెలిపారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించామని, పరారీలో ఉన్న తమ్మినేని దంపతులతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...