వార్తలకు తిరిగి వెళ్లండి

తాలిపేరు ప్రాజెక్ట్ సాగునీటి కాల్వల ఆక్రమణలపై జలవనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బడాబాబులు ఎకరాలకొద్దీ కాల్వకట్టలను కబ్జా చేసి సాగు చేసుకుంటున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీనివల్ల సామాన్య రైతుల పొలాలకు దారులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ప్రధాన కాల్వలు క్రమంగా కుంచించుకుపోతున్నాయి. అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

