వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణంలో బుధవారం తాగునీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. పురపాలక సంఘం పరిధిలో ఉన్న హెడ్ వాటర్ నందు గల ఊటబావిలో 10 హెచ్పీ సబ్ మెర్సిబుల్ మోటార్ మంటలు వచ్చి కాలాయని చెప్పారు.
దీంతో పట్టణం పరిధిలో తాగునీరు సరఫరాను నిలిపి వేస్తున్నామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

