వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గుంటిపల్లికి చెందిన బొడిగె వీరాగౌడ్(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గౌరారం ఏఎస్సై పోచాగౌడ్ తెలిపారు. ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు వెతకగా 17న ఉదయం వర్గల్లోని ఆయన షాప్లో మృతదేహం కనిపించింది. మృతికి ముందు వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. భార్య మానస ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

