Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథం ప్రారంభం

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 4:07 PM పార్వతీపురం మన్యంGeneral
సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథం ప్రారంభం - Udayam
హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సురక్ష చైతన్య యాత్ర ఎస్ఈడీ ప్రచార రథాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జీవనరాణి గురువారం ప్రారంభించారు. 15 రోజుల పాటు జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాలు, బస్టాండ్లలో ఈ వాహనం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్స, ఉచిత ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...