వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రజల నుంచి 117 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా భూ సమస్యలపై 59 వినతులు వచ్చినట్లు తెలిపారు.
వినతులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పోర్టల్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
