వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు ఊరట: ఫీజు వసూళ్లపై స్టే పొడగింపు

ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు, తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది. అప్పటివరకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదంటూ జారీ చేసిన గత స్టే ఉత్తర్వులే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
జీవో నంబర్-9లోని కొన్ని నిబంధనలపై వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికే న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 6న జరిగే విచారణలో ప్రభుత్వ, పిటిషనర్ల వాదనలను బట్టి తదుపరి ఆదేశాలు వెలువడనున్నాయి.
Comments
Loading comments...