Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చింది: నితిన్ నబీన్

భవ్య శ్రీ Jun 30, 2026 9:33 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చింది: నితిన్ నబీన్ - Udayam Digital
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను తన దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా మార్చిందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, నేరపూరిత పాలన సాగుతోందని, ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తూ ప్రజల సొమ్మును దిల్లీకి తరలిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, వీటి నుంచి తెలంగాణను కాపాడేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...