Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

రచన దేవి Jul 19, 2026 7:39 PM హైదరాబాద్about 16 hours ago
హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్యానీ షా టేక్రీ దర్గా సమీపంలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఫైజ్ మహ్మద్ (అజాన్)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో తీవ్ర కత్తిపోట్లకు గురైన ఫైజ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న కాలాపత్తర్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...