Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల రోడ్డుతో వాహనదారుల అవస్థలు

రూపేష్ గౌడ్ Jul 27, 2026 2:11 PM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
గుంతల రోడ్డుతో వాహనదారుల అవస్థలు - Udayam Digital
రావులపాలెం–రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద పైవంతెన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారాయి. భారీ గుంతలు, నిల్వ నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సర్వీస్ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...