Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ లీక్ చేస్తే కఠిన శిక్ష

అమరేష్ గౌడ్ Jul 25, 2026 6:52 AM అల్ ఇండియా 43 minutes ago
పేపర్ లీక్ చేస్తే కఠిన శిక్ష - Udayam Digital
ప్రశ్నపత్రాల లీక్‌లకు పాల్పడితే రూ.10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించే కొత్త బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆస్తుల జప్తు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించారు. నీట్-యూజీ లీకేజీ వివాదంలో ఎన్‌టీఏకు చెందిన 47 మంది సిబ్బందిని తొలగించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేసి, ఔట్‌సోర్సింగ్ విధానంలో పటిష్ట మార్పులు చేయనున్నారు.

Comments

G
Loading comments...