వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైలం దేవస్థానానికి 27 రోజుల హుండీ లెక్కింపులో రూ.5,45,55,035 నగదు ఆదాయం లభించింది. భక్తులు 127.5 గ్రాముల బంగారం, 3.68 కిలోల వెండితో పాటు వివిధ దేశాల విదేశీ కరెన్సీని కూడా కానుకలుగా సమర్పించారు.
ఈవో ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షణలో పటిష్ట భద్రత మధ్య లెక్కింపు ప్రక్రియ జరిగింది. గత కొద్ది రోజులుగా భక్తుల తాకిడి పెరగడంతో హుండీ ఆదాయం ఆశాజనకంగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

