వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే అర్జీలను సమగ్రంగా విచారించి, అవి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె స్పష్టం చేశారు.
అర్జీలు మళ్లీ రావడం అధికారుల నిర్లక్ష్యమేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 135 అర్జీలు, రెవెన్యూ క్లినిక్లో 172 వినతులు అందగా, ప్రజలు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

