Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం నాలుగో యూనిట్ సిద్ధం

ప్రణీత రెడ్డి Jul 18, 2026 10:58 AM మహబూబ్‌నగర్about 1 hour ago
శ్రీశైలం నాలుగో యూనిట్ సిద్ధం - Udayam Digital
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలోని నాలుగో యూనిట్‌ను ఈ నెలాఖరు కల్లా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2020లో జరిగిన ప్రమాదం తర్వాత సుదీర్ఘ మరమ్మతుల అనంతరం ఇది అందుబాటులోకి రానుంది. ఈ యూనిట్ ద్వారా 150 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి కానుంది. ఆగస్టు నాటికి డ్యామ్‌లోకి వరద నీరు వస్తే కేఆర్‌ఎంబీ అనుమతులతో ఉత్పత్తిని ప్రారంభించాలని జెన్‌కో ఇంజినీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...