వార్తలకు తిరిగి వెళ్లండి
కార్లే వారి మొబైల్ దుకాణాలు

సిద్దిపేట పట్టణ శివారులోని పూరిగుడిసెల ముందు కార్లు దర్శనమిస్తున్నా, వాటి యజమానులు ధనవంతులు కారు, ఉంగరాలు అమ్ముకునే పేదలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన ఆరు కుటుంబాలు ఈ కార్లనే మొబైల్ దుకాణాలుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నాయి.
ఇల్లు, స్థలాలు అమ్ముకుని లేదా లీజుకు కార్లను తీసుకున్న వీరు, కరీంనగర్ నుండి లోహపు ఉంగరాల సరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ పట్టణాల్లో మకాం వేస్తూ కార్ల వెనుక భాగంలోనే ఈ చిరువ్యాపారం చేసుకుంటున్నారు.
Comments
Loading comments...