వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
డ్రోన్లతో టీబీ పరీక్షలు.. తగ్గిన ఖర్చులు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐసీఎంఆర్ (ICMR) చేపట్టిన 'ఐ-డ్రోన్' పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. గ్రామీణ ప్రాంతాల నుండి టీబీ శాంపిళ్లను వేగంగా ల్యాబ్లకు చేర్చడానికి, మందుల పంపిణీకి ఈ డ్రోన్ సేవలను వినియోగించారు.
ఈ సాంకేతికతతో టీబీ నిర్ధారణ సమయం 15 రోజుల నుండి 5 రోజులకు తగ్గింది. అలాగే బాధితుల సగటు వైద్య ఖర్చులు రూ.9,451 నుండి కేవలం రూ.91కి తగ్గిపోవడంతో గ్రామీణ రోగులకు ఎంతో లబ్ధి చేకూరింది.
Comments
Loading comments...