Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో 19న స్పాట్‌ కౌన్సెలింగ్

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 10:48 AM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
గురుకులాల్లో 19న స్పాట్‌ కౌన్సెలింగ్ - Udayam
జోగులాంబ గద్వాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయాధికారిణి శోభారాణి తెలిపారు. 9వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం సీట్లను భర్తీ చేయనున్నారు. 8, 9 తరగతుల ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు హాల్‌టికెట్‌, బోనఫైడ్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో గట్టు గురుకుల కళాశాలకు హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...