వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు, సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. సరైన సమయానికి వర్షాలు లేక పంటల సాగు ఆలస్యమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వరుణ దేవుడు కరుణించి పంటలు పండాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జితేందర్, వార్డు సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

