వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో శ్రావణ మాసం మూడో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు.
శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
Comments
Loading comments...

