వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి న్యూఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న ఆమె తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి తన నివాసానికి చేరుకున్నారు.
గతంలో శ్వాస, ఉదర సంబంధిత సమస్యలతో చికిత్స పొందిన సోనియా ఆరోగ్యంపై ఇటీవల పలు ఊహాగానాలు వచ్చాయి. తాజాగా కంటి ఆపరేషన్ ముగియడంతో వైద్యుల సూచనల మేరకు ఆమె మరికొద్ది రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు.
Comments
Loading comments...

