వార్తలకు తిరిగి వెళ్లండి
సమస్యల పరిష్కారమే లక్ష్యం

కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు, సత్వర పరిష్కారాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...