వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమలలో శ్రీవారి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం కంపార్టుమెంట్లు నిండిపోయి, నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
మరోవైపు గురువారం 66,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.4.51 కోట్లుగా నమోదైంది. అలాగే 31,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Comments
Loading comments...