వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల చెరకు రైతులకు ఆధారమైన సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు సహకరించాలని రైతు సంఘాల నాయకులు, రైతులు ఎమ్మెల్యే బేబినాయనను కోరారు.
బొబ్బిలి కోటలో శుక్రవారం ఆయనను కలిసి సమస్య వివరించారు. పరిశ్రమను తాత్కాలిక లాకౌట్ చేస్తామని యాజమాన్యం ప్రకటించడంతో రైతులకు నష్టం జరుగుతుందని, పరిశ్రమను నడిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

