వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం దున్నూరు పంచాయతీ గడ్డూరు గ్రామానికి చెందిన వంక యాదవరావు (55) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. మంగళవారం ఉదయం ముగ్గురు మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లగా అలల ధాటికి తెప్ప బోల్తా పడింది.
నలుగురు సముద్రంలో పడిపోగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. యాదవరావు తెప్ప కింద చిక్కుకుని ఊపిరాడక అపస్మారక స్థితికి చేరి మరణించాడు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

