వార్తలకు తిరిగి వెళ్లండి
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి

Photo Gallery
అత్యున్నత భద్రతా ప్రమాణాలతో 2028 జూన్ నాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ (ఎస్ఎల్బీసీ) పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. భూసేకరణ అడ్డంకులను తొలగించి సొరంగం, కెనాల్ వ్యవస్థను ఏకకాలంలో నిర్మిస్తామన్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం జలాశయం నుండి 40 టీఎంసీల నీటిని తరలించి, సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...