వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడ అద్దంకి-నార్కట్పల్లి బైపాస్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత 18 నెలల్లో జరిగిన 68 ప్రమాదాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నందిపాడు, ఈదులగూడ కూడళ్లను అధికారులు 'బ్లాక్ స్పాట్లు'గా గుర్తించారు.
అతి వేగం, వీధి దీపాలు లేకపోవడం వంటి కారణాలతో నిత్యం ప్రాణనష్టం జరుగుతోంది. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే ఆయా కూడళ్లలో పై వంతెనల నిర్మాణమే ఏకైక మార్గమని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

