Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైరేట్ల చెరలో ఆరుగురు భారతీయులు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 10:10 AM జాతీయంGeneral
పైరేట్ల చెరలో ఆరుగురు భారతీయులు - Udayam
సోమాలియా తీరంలో కామెరూన్‌ పతాకంతో ప్రయాణిస్తున్న ‘లుటుఫ్‌’ కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. నౌకలోని పది మంది సిబ్బందిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుర్కియే సైనిక శిక్షణ కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్‌, శాటిలైట్‌ పరికరాలను తరలిస్తుండగా ఎనిమిది మంది పైరేట్లు నౌకను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...