వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో సీతారామా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తమకు వద్దని శనివారం పీసా గ్రామసభల్లో తీర్మానించారు. తాము పామాయిల్ సాగు చేసుకుంటున్నామని, కెనాల్స్ అవసరం లేదని స్పష్టం చేశారు.
భూగర్భ జలాల అభివృద్ధికి చెరువులను నింపాలని కోరారు. పీసా చట్టాన్ని గౌరవించి తమ తీర్మానాన్ని అమలు చేయాలని, ఈ ప్రతులను ఎమ్మెల్యే, కలెక్టర్లకు అందజేస్తామని సర్పంచులు వెల్లడించారు.
Comments
Loading comments...

