Back to feed
రామమందిర విరాళాలపై సిట్ విచారణ
Priya Jun 20, 2026 5:52 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ విచారణ చేపట్టినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. విమర్శకుల వద్ద సాక్ష్యాలు ఉంటే సమర్పించాలని కోరుతూ, 15 రోజుల్లో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.
రామమందిరం పవిత్రతను దెబ్బతీసేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని యోగి మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, రామభక్తులు నిశ్చింతగా ఉండాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...



