వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్(యు) ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం బురదగా మారి నడవడానికి వీలు లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర వైద్యం కోసం వచ్చే గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

