వార్తలకు తిరిగి వెళ్లండి

భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతాయుతంగా సంరక్షించాలని సీతారాంపల్లి గ్రామ సర్పంచ్ భానుశ్రీ పిలుపునిచ్చారు.
మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

