వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని మార్వాడీ గల్లీలోని పురాతన బాలాజీ మందిరంలో శతాబ్దాల నాటి శ్రీకృష్ణ అద్దాల ఉయ్యాల భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారం రోజుల ముందే ఉయ్యాలను ఏర్పాటు చేస్తారని భక్తులు తెలిపారు.
ఇంత పురాతన అద్దాల ఉయ్యాల ఈ ప్రాంతంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు.
Comments
Loading comments...

