Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగుమతులపై కేంద్రానికి శ్రీధర్‌బాబు వినతి

భవ్య శ్రీ Jul 04, 2026 1:52 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
ఎగుమతులపై కేంద్రానికి శ్రీధర్‌బాబు వినతి - Udayam Digital
రాష్ట్రంలో ఎగుమతుల బలోపేతం, మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం, ఫార్మా రంగానికి వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పసుపు, పత్తి, మసాలా దినుసుల ల్యాబ్‌లను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...