వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మాత బండ్ల గణేశ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ

రుణం చెల్లించనందుకు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబ ఆస్తులను బ్యాంక్ వేలం వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. గతంలో ఆయనకు అనుకూలంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన తీర్పును న్యాయస్థానం కొట్టేసింది.
పరమేశ్వర పౌల్ట్రీ ఫాం తీసుకున్న అప్పులకు గ్యారెంటీగా ఉన్న జూబ్లీహిల్స్ ఆస్తిని యూనియన్ బ్యాంక్ రూ.8.50 కోట్లకు వేలం వేసింది. ఈ చర్య సర్ఫేసి చట్టం కింద సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Loading comments...