వార్తలకు తిరిగి వెళ్లండి

బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు అస్సాం ప్రభుత్వం బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేసింది. ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా ప్రకటించారు.
అలాగే బహుభార్యత్వాన్ని పాటించే వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుండి తక్షణమే తొలగిస్తామని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...

