వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి,వారి హక్కుల పరిరక్షణకు ఏఐఎస్ఎఫ్ రక్షణ కవచంగా నిలుస్తోందని ఆ సంఘం శాతవాహన వర్సిటీ కన్వీనర్ జంగాపెల్లి వరుణ్ అన్నారు.
కరీంనగర్ వర్సిటీ ఆవరణలో ఏఐఎస్ఎఫ్ 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన సంఘం జెండాను ఆవిష్కరించారు. త్వరలోనే వర్సిటీ సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్, శ్రీనివాస్నాయక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

