వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసాలో గణేష్ ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ బుధవారం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
వినాయక నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

