వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో వేంచేసియున్న శ్రీ దుర్గా భవాని దేవస్థానంలో గత3 రోజులుగా సాగుతున్న శాకంబరీ దేవి ఉత్సవాలు గురువారంతో కోలాహలంగా ముగిశాయి.శ్రావణమాస ఆరంభాన్ని పురస్కరించుకుని చివరి రోజున అమ్మవారిని రకరకాల పూలు,పండ్లు,కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అర్చకులు బాల సాయి నేతృత్వంలో నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, శాకంబరీ దేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Loading comments...

