వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద 7 కిలోల వెండి నాణేలను సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని అనుమానంతో తనిఖీ చేయగా వెండి నాణేలు గుర్తించారు.
వెండికి సంబంధించిన బిల్లులు, ఇతర పత్రాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. వెండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

