వార్తలకు తిరిగి వెళ్లండి
బీబీనగర్ ఎయిమ్స్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం: జేపీ నడ్డా

బీబీనగర్ ఎయిమ్స్ను దక్షిణాదిలోనే అత్యాధునిక వైద్య కేంద్రంగా మారుస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతం 87 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరికల్లా పూర్తి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇక్కడ రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులను పెంచుతామని, వైద్య సేవల్లో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. మోదీ హయాంలో దేశంలో ఎయిమ్స్ల సంఖ్య 7 నుంచి 23కు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...