వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రహరీ గోడను ఢీకొన్న కారు

హుజురాబాద్ మండలం నుంచి వీణవంక వెళ్తున్న కారు, వెంకటేశ్వర్ల పల్లి వద్ద అదుపుతప్పి ప్రహరీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణారెడ్డి, రమ్య, చిన్నారి అన్విక్ తీవ్రంగా గాయపడ్డారు. మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...